IPL 2024 : పంజాబ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం

-

తన చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అభిషేక్ 28 బంతుల్లో 66, రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 33, నితీశ్ రెడ్డి 25 బంతుల్లో 37, క్లాసెన్ 26 బంతుల్లో 42 పరుగులతో అదరగొట్టారు. హర్షల్ పటేల్, అర్ష్దీప్ చెరో 2 వికెట్లు, శశాంక్ సింగ్, హర్హీప్రీత్ చెరో వికెట్ తీశారు.

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణిత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. అథర్వ (46), ప్రభుసిమ్రాన్ సింగ్ 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే రోస్సో కూడా 49 పరుగులు చేశాడు.జితేష్ శర్మ ఇవాళ 32 పరుగులు చేసి చివరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాట్ కమ్మిన్స్ 4 ఓవర్లు వేసి 36 పరుగులు సమర్పించుకొని ఒక వికెట్ తీశాడు. నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. 33 పరుగులు ఇచ్చాడు. విజయ్ కాంత్ 37 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి కేవలం 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 54 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి బంతికి కూడా జితేష్ శర్మ సిక్స్ తో ముగించేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news