ఐపీఎల్ క్రేజ్.. జియో సినిమాలో రికార్డ్ వ్యూస్

-

ఐపీఎల్ సీజన్-17లో వ్యూస్ పరంగా జియో సినిమా రికార్డు సృష్టించింది. బెంగళూరు-చెన్నై మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో కొత్త మైలురాయిని నెలకొల్పింది. జియో సినిమాలో ఈ మ్యాచ్కు రికార్డు స్థాయిలో 50 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్కు అత్యధికంగా 38 కోట్ల వ్యూస్ రాగా నిన్నటి మ్యాచ్ ఆ వ్యూస్ను అధిగమించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

కాగా, 2024 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హిస్టరీ క్రియేట్ చేసింది. సీజన్లో తొలి 8మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి చేరుకున్న ఈ టీమ్.. ఆ తర్వాత ఆడిన ఐదు మ్యాచ్ల్లో వరుసగా అన్నింట్లోనూ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో కీలక జట్టుగా నిలిచింది. నాకౌట్కు చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్షలాది మంది అభిమానుల మద్దతుతో, వాతావరణం కూడా సహకరించిన వేళ ఆర్సీబీ శనివారం చిన్నస్వామి స్టేడియంలో అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్పై 27 పరుగుల తేడాతో నెగ్గి సగర్వంగా ప్లే ఆఫ్స్కు ఎంట్రీ ఇచ్చి ఔరా అనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news