IRCTC : వైజాగ్ నుండి కాశీ మరియు మేఘాలయ టూర్ ప్యాకేజ్…!

-

IRCTC ఇప్పటికే అనేక ప్యాకేజీలను తీసుకు వచ్చింది. దీనితో ప్రయాణికులకు సులభంగా ఉంటుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి IRCTC ప్యాకేజీలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు కొత్తగా వైజాగ్ నుండి కాశీ మరియు మేఘాలయ కి టూర్ ప్యాకేజీలు ని తీసుకు రావడం జరిగింది. ఆసక్తి ఉన్న వాళ్లు వైజాగ్ నుండి కాశీ మరియు మేఘాలయకి వెళ్ళవచ్చు.

తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 11, 2021 వైజాగ్ నుండి టూర్ స్టార్ట్ అవుతుంది. 16 ఏప్రిల్ 2021 తో ఈ టూర్ ముగిస్తుంది. ఈ టూర్ లో భాగంగా ప్రయాణికులు వారణాసి, ప్రయాగరాజ్, అయోధ్య మరియు లక్నో ని చూడొచ్చు. IRCTC ఏరియా ఆఫీసర్ చంద్రమోహన్ బిసా, ఈ టూర్ కి సంబంధించి వివరాలు చెప్పారు. సింగల్ ఆక్యుపెన్సీ ధర రూ. 35,070, డబల్ ఆకుపెన్సీ ధర రూ. 28,399 , ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 26,780 గా వుంది.

ఇక మేఘాలయ టూర్ కి సంబంధించి వివరాలని చూస్తే… విశాఖపట్నంలో ఇది 27 ఏప్రిల్ 2021 మొదలవుతుంది. 29 ఏప్రిల్ 2021 తిరిగి వస్తారు. షిల్లాంగ్, గౌహతి, చిరపుంజి, మౌలినాంగ్, కజిరంగా, గౌహతి ప్రాంతాలను చూడొచ్చు. ఈ మేఘాలయ ప్యాకేజీ ధర విషయానికి వస్తే…సింగల్ ఆక్యుపెన్సీ ధర రూ. 36,199 , డబల్ ఆక్యుపెన్సీ ధర రూ. 30,099 మరియు ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 28,059 గా వుంది.

ఫ్లైట్ టికెట్స్, త్రీ స్టార్ హోటల్ అకామిడేషన్, ప్రయాణం ఖర్చులు, ఏసీ వాహనాలలో సైట్ సీఇంగ్ అన్ని ఈ ప్యాక్ లోనే ఉన్నాయి. అల్పాహారం డిన్నర్ కూడా ఇందులో నుండే. ఇది ఇలా ఉండగా వైజాగ్ నుంచి జనవరి నెల లో కాశ్మీర్ మరియు కేరళ ట్రిప్స్ కూడా ఉన్నాయి. మీరు మరిన్ని వివరాల కోసం www.irctctourism.com లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news