గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య.. కారణం ఇదేనా?

-

ఏపీలోని గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట శుక్రవారం ఉదయం పెదకాకాని రైల్వే స్టేషన్ సమీపంలో విగతజీవులుగా కనిపించారు.తమ పెళ్లికి కుటుంబీకులు ఒప్పుకోరనే భయంతో వారిద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

మృతులు పెద్దకాకానికి చెందిన దానబోయిన మహేష్ (22), కృష్ణాజిల్లా నందిగామకు చెందిన శైలజ(20)గా గుర్తించారు. వెంటనే వారి కుటుంబీకులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.కాగా, ఘటనా స్థలంలో మృతులకు సంబంధించిన ద్విచక్ర వాహనం, లగేజ్ బ్యాగులు లభ్యమయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెదకాకాని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news