FIRST WICKET RECORD: శిఖర్ ధావన్ రహానే రికార్డ్ బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్ గిల్ ల జోడీ

-

ప్రస్తుతం ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన మూడు వన్ డే ల సీరీస్ లో భాగంగా ఆఖరి వన్ డే జరుగుతోంది. ఈ మ్యాచ్ కు ముందు వన్ డే సీరీస్ 1-1 తో సమంగా ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సీరీస్ ను కైవశం చేరుకుంటుంది. అందులో భాగంగా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఓపెనర్ లుగా వచ్చిన ఇషాన్ కిషన్ మరియు శుబ్ మాన్ గిల్ లు మొదటి వికెట్ కు 143 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (77) అర్థ సెంచరీ పూర్తి చేసుకుని ఔట్ అయ్యాడు. ఆ తర్వాత శుబ్మాన్ గిల్ సైతం 85 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కాగా వీరిద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యం ప్రస్తుతానికి వెస్ట్ ఇండీస్ గడ్డపై అత్యధికం. వీరికి ముందు శిఖర్ ధావన్ మరియు అజింక్య రహానే లు 2017 లో మొదటి వికెట్ కు 137 పరుగులు చేసి ఉన్నారు.

ఇప్పుడు ఇషాన్ కిషన్ మరియు గిల్ ల జోడీ చరిత్రలో నిలిచింది. కాగా ఈ మ్యాచ్ లో ఇండియా భారీ స్కోరు దిశగా దూసుకు వెళుతోంది. క్రీజులో సూర్య మరియు హార్ధిక్ లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version