చెట్టినాడ్ గ్రూప్ మీద ఐటీ సోదాలు..ఏకకాలంలో 50 ప్రాంతాల్లో !

-

చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఐటీ దాడులు జరుగుతున్నాయి. 100 టీమ్స్ తో సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, హైద్రాబాద్, ముంబైలతో పాటు 40 ప్రదేశాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెట్టినాడు గ్రూప్ మీద చెన్నైలో సీబీఐ కేసు నమోదు అయింది. ఇక ఉదయం నుండి కంపెనీల మీద ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, ఆంధ్ర, తెలంగాణ కలిపి 50 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.

పన్ను ఎగవేతకు సంబంధించి ఈ ఐటి దాడులు జరుగుతున్నట్టు చెబుతున్నారు. నిర్మాణం, సిమెంట్, పవర్, స్టీల్ బిజినెస్ లో చెట్టినాడ్ గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. చెన్నై, హైదరాబాద్ లో ఉన్న చెట్టినాడ్ కార్యాలయాల మీద, చెట్టినాడ్ ఛైర్మెన్ ముత్తయ్య ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. 2015 లోనూ భారీగా పన్ను ఎగువేతకు సంబందించి దాడులు చేసిన ఐటి అప్పుడు ఏమీ ప్రూవ్ చేయలేకపోయింది. 3 రాష్ట్రాల్లో 100 టీమ్స్  50 ప్రదేశాల్లో ఐటి దాడులు జరుగుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news