రేపు మోడీ తో జగన్ భేటీ..!

-

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఏపీ రాజకీయాలు ఢిల్లీ వేదికగా మారిపోయాయి బిజెపితో పొత్తుల విషయంలో ఇప్పటికే ఒకసారి పవన్ కళ్యాణ్ అమిత్ షా తో భేటీ అయ్యారు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షా తో భేటీ అయ్యారు. పొత్తుల గురించి చర్చించారు. ఈరోజు హైదరాబాద్ వచ్చాక మళ్ళీ పవన్ కళ్యాణ్ నివాసం లో చంద్రబాబు భేటీ అవ్వబోతున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే ఈ రోజు రాత్రి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది అలానే రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు మీద చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీ ప్రధాన పార్టీ లీడర్స్ అందరూ బిజెపితో వరుస సమావేశాలు నిర్వహించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news