బాలు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్, కేసీఆర్..?

-

గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టిందన్న విషయం తెలిసిందే. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సంగీతానికి ఒక గొప్ప వన్నెతెచ్చిన… మహోన్నత గాయకుడు… దూరం అవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఎస్పీ బాలు మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్పీ బాలు మృతి పై స్పందిస్తూ సంతాపం తెలియజేశారు.

ఎన్నో మధుర గీతాలు పాడి ప్రజల ప్రేమ అభిమానాలు సంపాదించుకున్నారని… ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. కేవలం గాయకుడిగా కాకుండా నటుడిగా దర్శకుడిగా కూడా తన ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అంటూ కొనియాడారు. బాలు ఇక లేరు అన్న వార్త తన మనసుకు ఎంతో ఆవేదన కలుగజేసింది అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version