బ్రేకింగ్ : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 23 శాతం పిఆర్సి ప్రకటించిన జగన్ సర్కార్

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఉద్యోగులకు… 23 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల నుంచే ఈ పిఆర్సి అమలు కానున్నట్లు స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ కొత్త జీతాలు జనవరి 1, 2022 నుంచే వర్తిస్తాయని ఏపీ సర్కార్ ప్రకటన చేసింది.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే జూన్ 30 వ తేదీలోగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తాము ప్రకటించిన పిఆర్సి అందరూ ఆహ్వానించాలని ఉద్యోగ సంఘాలను కోరారు సీఎం జగన్. ఈ కార్డు ఏపీ ఉద్యోగులు కూడా సీఎం జగన్ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version