ఢిల్లీ పర్యటనకు జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కేసులు పెరగడమే గాని తగ్గే అవకాశాలు అయితే ఇప్పట్లో అసలు కనపడటం లేదు. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే ఏపీ సిఎం జగన్ ని కంగారు పెడుతుంది. కరోనా కేసులు పెరిగితే పరిస్థితి ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. వైద్యం అందించడం చాలా వరకు కష్టం అవుతుంది.

jagan

వేల కేసులు పెరుగుతూ పోతు ఉంటే వైద్య సౌకర్యాలు ఏపీ లో ఆశించిన స్థాయిలో లేవు అనే చెప్పాలి. దీనితో ఇప్పుడు కేంద్ర సాయం కోసం జగన్ చేతులు చాపే అవకాశం ఉంది అని అంటున్నారు. కేసులను అదుపు చేయడానికి గానూ ఇప్పుడు ఆయన కేంద్ర నిధులతో పాటుగా ప్రత్యేక వైద్య బృందాలను కూడా ఏపీకి రావాలి అని కోరే అవకాశం ఉంది అని, ఈ నెలలో కరోనా కేసుల నిమిత్తం సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version