మానవత్వం చాటుకున్న జగన్..ఆ బాలిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం

-

ఏపీలో అనకాపల్లి జిల్లా బాలిక హత్యకేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే.ఈ నెల 6న రాంబిల్లి మండలం కొప్పు గొండుపాలెంలో మైనర్ బాలిక హత్యకు గురి అయింది. ఈ ఘటనపై పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బాలిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేసి వైఎస్ జగన్ మరోసారి మానవత్వం చాటుకున్నారు.బాలిక కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయింది అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నాయని కాని బాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో రూ.8 వేల కోట్లు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు అని విమర్శించారు.

కాగా, హత్య గురైన బాలిక రాంబిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 6న ఆమె పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటి తర్వాత బోడాబత్తుల సురేష్‌ అనే యువకుని చేతిలో హత్యకు గురైంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version