జగ్గంపేట టికెట్ దక్కలేదని బోరున ఏడ్చిన జనసేన

-

మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేయగా తాజాగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను చేసింది. కాకినాడ(D) జగ్గంపేట టీడీపీ టికెట్ జ్యోతుల నెహ్రూకు దక్కింది. దీంతో మనస్తాపం చెందిన జనసేన నేత పాఠంశెట్టి సూర్యచంద్ర బోరున విలపించారు. ‘టికెట్ ఆశించడం మన తప్పు. మనలాంటి రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్లు ఎమ్మెల్యే టికెట్ కోరుకోకూడదు అని ఆయన  అసహనం వ్యక్తం చేశారు .

డబ్బులు లేని వాళ్లం మనం టికెట్ ఆశించడం పొరపాటు’ అని అభిమానులు, సన్నిహితుల వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. అటు అచ్యుతాపురం దుర్గాదేవి గుడిలో ఆయన ఆమరణ దీక్షకు దిగారు.ఇవాళ తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news