కేసీఆర్ కి భయం పుట్టుకొచ్చింది అందుకే టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు: జగ్గారెడ్డి

-

అబద్దాలకి కెసిఆర్ పెట్టింది పేరు అని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ దాదాపు 9 ఏళ్ల తర్వాత కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది అని అన్నారు ఆయన కోతల రాయుడు అని మండిపడ్డారు కేసీఆర్ ప్రసంగంలో ఒక ఫ్రస్టేషన్ స్పష్టంగా కనపడిందని చెప్పారు. పార్టీని కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా తనతో టచ్ లో ఉన్నారని అన్నారు.

ఎన్ని ఫీట్లు చేసినా రాష్ట్రంలో పార్టీని నమ్మేస్థితిలో ప్రజలు లేరని చెప్పారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు వంచనకి గురయ్యారని చెప్పారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మని ప్రజలకి మళ్లీ గుర్తు చేసుకునే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు సొంత పార్టీ నాయకుల్లోనే కేసీఆర్ మీద ఉన్న నమ్మకం పోయిందని అన్నారు. గతంలో మీడియాని ఆమడ దూరం పెట్టి ఉన్న కేసీఆర్ నిన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ నాలుగు గంటలకు కూర్చున్నారు అంటే ఎంత భయం పుట్టుకొచ్చిందో అర్థమైంది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news