నేడు జమ్మూ కాశ్మీర్ లో రెండో విడత ఎన్నికలు

-

జమ్మూ కాశ్మీర్  రెండో దశ పోలింగ్ కు సర్వం సిద్ధం అయింది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రెండో దశలో భాగంగా మొత్తం 26 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇందులో జమ్ములో 11 నియోజకవర్గాలు, కాశ్మీర్ లో 15 నియోజకవర్గాలున్నాయి.  మొత్తం 239 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

ఇక రెండో విడతలో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా, అప్పి పార్టీ అధినేత అల్తాప్ బుఖారీలు బరిలో ఉన్నారు. రెండో విడత పోలింగ్ సెంట్రల్ కాశ్మీర్ జిల్లాలు అయిన బుద్ఘాం, శ్రీనగర్, గండర్ బాల్, జమ్మూ ప్రాంతంలో పూంచ్, రాజౌరీ జిల్లాలలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 20 లక్షలకు పైగా ఓటర్లు పోలింగ్ లో పాల్గొంటారు. తొలి దశలో 61.38 శాతం పోలింగ్ నమోదు అయింది. అక్టోబర్ 01న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 08న ఫలితాలు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version