విశాఖపట్నంలో ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు. 28న ఉదయం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో, 29న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 10-15 మంది కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు.

ఈ నెల 30వ తేదీన విశాఖ మున్సిపల్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాకుండా ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఏపీని అభివృద్ధి చేసే దిశగా ముందడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇక పవన్ కళ్యాణ్ తనకు సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్ లలో నటిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతున్నారు.