ఈ నెల 24న జరగాల్సిన జనవాణి వాయిదా : నాదెండ్ల మనోహర్‌

-

ఏపీలో జనసేన పార్టీ జనవాణి పేరుతో భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజల వద్ద నుంచి సమస్యలపై అర్జీలను జనసేనాని పవన్‌ కల్యాణ్ స్వయంగా అర్జీలను స్వీకరిస్తున్నారు. అయితే.. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు వైరల్‌ ఫీవర్‌ వచ్చింది.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం పవన్‌ కల్యాణ్‌తో పాటు ప్రోగ్రాం కమిటీ నాయకులు , సెక్యూరిటీ సిబ్బంది కూడావైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.

ఈ నేపథ్యంలోఈనెల 24 న జరగాల్సిన జనవాణి వాయిదా వేసి ఈ నెల 31 న రాయలసీమ లేదా ఉత్తారాంధ్రలో తదుపరి జనవాణి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఐదు విడతలకు గానూ మూడు విడతల జనవాణిని పూర్తిచేశామని తెలిపారు నాదెండ్ల మనోహర్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version