ఎట్టకేలకు అనుకున్నది సాధించిన జాన్వీ కపూర్..!

-

ఏదైనా పట్టుపడితే సాధించనిధి ఏదీ లేదు అని మరొకసారి నిరూపించింది అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. అసలు విషయంలోకి వెళ్తే.. అతిలోకసుందరి శ్రీదేవి చనిపోయే ముందు తన కూతురు జాన్వీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే అది ఎన్టీఆర్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలని అది కూడా ఆమె స్వయంగా ఎన్టీఆర్ తో మాట తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ల ఎంపిక విషయంలో గత కొన్ని రోజుల నుంచి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ నీ తీసుకుంటున్నారని గతంలో వార్తలు రాగా.. ఆమె తనకి ఇంకా అదృష్టం రాలేదు అని.. ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని కూడా తెలిపింది

అంతేకాదు ఎన్టీఆర్ తో కలిసి నటించడం తన అదృష్టం అంటూ ఓపెన్ కామెంట్లు చేసింది జాన్వి కపూర్. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ రేంజ్ కు సరిపడా స్టార్ బ్యూటీని ఫైనల్ చేయడంలో కష్టతరమైనందున యంగ్ బ్యూటీని ఎన్టీఆర్ కు జోడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంపికైందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏ ఒక్క హీరోయిన్ కూడా సెట్ కాకపోవడం వల్ల జాన్వీ కపూర్ ను ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీలో గట్టిగా వార్తలు వినిపిస్తూ ఉండడం.

స్టార్ కిడ్ గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమనే చెప్పాలి. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది కానీ ఎన్టీఆర్ 30లో ఈ ముద్దుగుమ్మ అవకాశం దక్కించుకోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా రానుందట. ఈనెల 12వ తేదీన పూజా కార్యక్రమాలను నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు ఈ చిత్రానికి రూ.200 కోట్లు బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news