సాంప్రదాయ దుస్తుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

-

అలనాటి అందాల తార, దివంగత శ్రీదేవి కూతురు.. జాన్వి కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన స్నేహితురాలితో కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంది. నేడు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో హీరోయిన్ జాన్వి కపూర్ స్వామివారి సేవలో పాల్గొంది. అచ్చమైన తెలుగు అమ్మాయిలా సాంప్రదాయ దుస్తులలో కనిపించి ఆకట్టుకుంది. దర్శనానంతరం అర్చకులు ఆమెకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇక తల్లి శ్రీదేవి బాటలో పయనిస్తూ.. ఇప్పటికే జాన్వి బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి నటి అనిపించుకుంది. తన తల్లిలానే తనకి తిరుమల అంటే ఎంతో ఇష్టమని.. స్వామివారి సన్నిధిలోనే పెళ్లి చేసుకుంటానని జాన్వి ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే తెలుగు ప్రేక్షకులు జాన్వీ కపూర్ తెలుగు సినిమాలలో నటించాలని.. తల్లి శ్రీదేవిలా ఆలరించాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version