జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ..ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ !

-

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన అందాల భామ జాన్వీ కపూర్‌. అలాగే శ్రీదేవి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది. `దడక్‌` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్‌’కు రీమేక్‌గా వచ్చింది.

ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. అయితే తాజాగా… జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్త నిన్నటి నుంచి హల్ చల్ చేస్తోంది. సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్… దర్శకత్వంలో లో ఈ భామను నటించనుందట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ కథానాయకుడు అని ప్రచారం జరుగుతోంది.

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా మూవీ నుంచి చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది ఈ ప్రాజెక్టు పూర్తికాగానే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ మళ్ళీ ఓ మూవీ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ పాన్ ఇండియా మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. పూర్తి కథనం తో ఇంప్రెస్ అయిన జాన్వికపూర్ ఈ ప్రాజెక్టు ఓకే చెప్పిందట. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version