ప్రముఖ హీరో జయం రవిపై చాలా రోజుల నుంచి అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. జయం రవి తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంటున్నారని అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జయం రవి తనపై వస్తున్న వార్తలను నిజం చేశారు. జయం రవి, కేనీషాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలలో వీరిద్దరి మెడలో దండలు, పండితుల సమక్షంలో వీరిద్దరూ ఉండడంతో వివాహం చేసుకున్నారని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే…. జయం రవి నిన్న సోషల్ మీడియా వేదికగా తన ప్రొడక్షన్ సంస్థ ‘రవి మోహన్ స్టూడియోస్’ లోగోను ఆవిష్కరించారు. దానికన్నా ముందు కెనీషాతో కలిసి చెన్నై మురుగన్ దేవాలయానికి వెళ్లారు. అక్కడ దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత పూజలు నిర్వహించి పండితులతో కలిసి ఫోటోలు దిగారు. ఆ సమయంలో వారిద్దరి మెడలో పూల దండలు ఉన్నాయి. దీంతో వీరిద్దరూ నిజంగానే వివాహం చేసుకున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం పైన జయం రవి ఏదో క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రాదు.