మాకు వీపు పగిలినప్పుడే చంద్రబాబు కి పగలాల్సి ఉంది.. జేసీ ఆసక్తికర కామెంట్స్ !

-

ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో తళుక్కున మెరిసిన జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు కు సీఐడీ నోటీసులు ఇచ్చారు అని నోటీసు ఒక్క పెజి ఇచ్చారని అన్నారు. కానీ జగన్ కి  నోటీసు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకెళ్లాలని అన్నారు. బాబుకు దొనకొండ కానీ..వైజాగ్ కానీ రాజధాని చేయాలని ముందే చెప్పానని, ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదని అన్నారు. స్వతహాగా తాను చంద్ర బాబు వ్యతిరేకిని అని ఆయన అన్నారు.

జగన్ గురించి వైఎస్సే  వాడు నా మాట వినదు… వాళ్ళ తాత మాట మాత్రమే వింటాడు అని చెప్పే వాడని షర్మిల కూడా పట్టుదల కలిగిన మనిషి… వైఎస్ కి ప్రాణం అని అన్నారు. ఆమె మొండిదన్న జేసీ రాయల సీమలో షర్మిల తిరిగితే అన్నని కూడా దీకొట్ట కొట్టగలదని,  రాయల తెలంగాణ ఉంటే… కాంగ్రెస్ అధికారంలో ఉండేదని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణ కోసం మీరు  కొట్లాడారని కిరణ్ కుమార్ రెడ్డికి దేవుడు తలరాత ఎక్స్ట్రార్డినరీగా రాశాడని కానీ ఆయనకు స్కిల్ లేదని అన్నారు. మాకు వీపు పగిలినప్పుడే చంద్రబాబు కి పగలాల్సి ఉండేదని ఆలస్యం ఎందుకైంది అనేది మా అనుమానం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news