వంగవీటి హత్యతో టీడీపీ పతనం …అడ్వకేట్ల హత్యలతప్ టీఆర్ఎస్ పతనం !

-

టీఆర్ఎస్ గుండాల అరాచకం కి పోలీసు యంత్రాంగం బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. మంథనిలో ఇసుక దందా..మొదలుకుని అన్నీ అక్రమాలు టీఆర్ఎస్ చేస్తుందని అన్నారు. నాగమణి… స్థానిక డీసీపీ ని కలిసి భద్రత కల్పించాం కోరారమో. డీసీపీ … దేవాలయ భూమి పంచాయతీ మేము ఏం చేయలేము అని చెప్పడం అనుమానంగా ఉందని జీవన్ రెడ్డి అన్నారు.

ఫ్రెండ్లీ పోలీస్ ప్రజలకు కాదు… టీఆర్ఎస్ నాయకులకు ఫ్రెండ్లీ పోలీస్ అయ్యారని అన్నారు. కేసీఆర్ హాలియాలో టీఆర్ఎస్ కి ఎదురు తిరిగితే నశంగా కొడతా అన్నాడని, అందుకే మంథని హత్యలా..? అని ప్రశ్నించారు అయన. టీఆర్ఎస్ ని వ్యతిరేకించిన ఇద్దరిని చంపి కేసీఆర్ కి బర్త్ డే కానుకగా ఇచ్చారా..? అని ఆయన ప్రశ్నించారు. మేధావులు… విద్యావంతులు ఓ సారి ఆలోచించాలని ఆయన అన్నారు. తెలంగాణలో పరిస్థితులు ఎటు దారి తీస్తున్నాయి అనేది చూడండని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version