దేవినేని ఉమ ఓ కుక్క..తగిన శాస్తి జరగాల్సిందే : వైసీపీ ఎమ్మెల్యే

-

తాడేపల్లి : దేవినేని ఉమ పై ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమ కుక్క మొరిగినట్లు మొరుగుతున్నాడని..మట్టి, ఇసుక, బూడిద కూడా దోచుకున్న వ్యక్తి ఉమ అని నిప్పులు చెరిగారు. ఎస్సీ లు, ఎస్టీలు, బీసీల పై దాడి చేస్తే ఊరుకుంటారా? ఎస్సీ లు, ఎస్టీలు, బీసీలను తిడితే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు.

ఉమకు తగిన శాస్తి జరగాల్సిందేనని..బుద్ధి లేని వ్యక్తి ఉమ అని మండిపడ్డారు. తన కారు పై దాడి చేస్తే టీవీ ఛానళ్ళకు ఉమ దర్జాగా ఎలా మాట్లాడారు? అని నిలదీశారు. ఉమాపై తగిన కేసులు పెట్టాలని డీజీపీకి జోగి రమేష్‌ విజ్ఞప్తి చేశారు. ఉమతో పాటు గూండాలు, రౌడీలు వచ్చారని…తమపై దాడి చేస్తే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ జరగటానికి ఈ ప్రభుత్వంలో అవకాశమే లేదని.. పెయిడ్ మీడియాను తీసుకుని వెళ్లి డ్రామా చేయటానికి ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడ్డారని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version