రేపు ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి

-

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వీరు హస్తం కండువా కప్పుకోనున్నారు. రేపు దీనిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు.

కాగా.. పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఖమ్మం, మహబూబ్‌ నగర్‌లలో బహిరంగ సభలు నిర్వహించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సభల్లోనే నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా సమాచారం. ఇక, ఇప్పటికే జూపల్లి కృష్ణారావు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కాంగ్రెస్ నేత సంపత్.. జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేకంగా సమావేశమై ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version