‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ ఫేస్ బుక్ పేజీని ప్రారంభించిన అమృత!

-

మిర్యాలగూడలో ఇటీవల జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీసింది. సోషల్ మీడియాలోనూ ఈ పరువు హత్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకా కుల గజ్జితో హత్యాకాండ సాగిస్తున్న మారుతీరావు లాంటి వాళ్లను సహించేది లేదని తెగేసి చెబుతున్నారు.

హత్య చేయబడిన ప్రణయ్ భార్య అమృతకు అండగా లక్షలాది మంది ఉద్యమిస్తున్నారు. ఇక.. ప్రణయ్ ను హత్య చేయించిన వారిని, హత్య చేసిన వారిని వదిలేది లేదని.. వాళ్లను వెంటనే ఉరి తీయాలని అమృత డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జస్టిస్ ఫర్ ప్రణయ్ అనే ఓ ఫేస్ బుక్ పేజీని అమృత ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా ప్రణయ్ జస్టిస్ కోసం ఉద్యమిస్తున్న వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని అమృత ఆ పేజీలో పోస్ట్ చేస్తోంది. అందరూ కలిసికట్టుగా ప్రణయ్ కోసం ఉద్యమిస్తున్నందుకు అమృత ఈసందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news