నేడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో జ్యోతిరాధిత్య సింథియా పర్యటన

-

బిజెపి పార్లమెంట్ ప్రవాస యోజన లో భాగంగా హైదరా బాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా పర్యటించనున్నారు. నేడు, రేపు నియోజక వర్గం లో పలు కార్యక్రమాల్లో పాల్గొన నున్నారు సింథియా. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారులు,మేధావులతో సమావేశంకానున్న జ్యోతిరాధిత్య సింథియా.. తాజ్ ఫలక్ నామలో బస చేయనున్నారు.

అలాగే 11 గంటలకు హైదరాబాద్ పార్లమెంట్ కోర్ కమిటి సమావేశం నిర్వహించనున్నారు. 12 గంటలకు హైదరాబాద్ జిల్లా పార్టీ పదాధికారుల సమావేశం జరుగనుంది. 12.45కి మీడియా సమావేశంలో ఆయన పాల్గొంటారు.

2 గంటలకు గౌలిపురా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొననున్న సిందియా… సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు రాజస్థాన్ భవన్ లో ఐటి, సోషల్ మీడియాతో సమావేశం కానున్న సిందియా… శనివారం ఉదయం 7 జిల్లాల మోర్చాల అధ్యక్షులతో సమావేశం కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కార్వాన్ లో మొదటి సారి ఓటు వేయనున్న యువతతో సమావేశం కానున్నారు సిందియా.

Read more RELATED
Recommended to you

Exit mobile version