కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ గుర్తు కుండ !

-

ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వెల్లడించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్ కుండ గుర్తును కేటాయించిందని వెల్లడించారు.

కుటుంబ పాలన మనకు వద్దని కుండ పాలన కావాలని అభిప్రాయపడ్డారు. కుండ గుర్తును తమకు కేటాయించినందుకు ఎన్నికల కమిషన్ కు కేఏ పాల్ దన్యవాదాలు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ లో కామన్ సింబల్ తో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. శాంతి పాలన రావాలంటే కుండ పాలన రావాలని తెలిపారు. మండుతున్న ఎండలకు డాక్టర్లు ,సైంటిస్టులు ఫ్రిజ్ లోని నీళ్లు తాగొద్దని చెబుతున్నారని అందుకే మంచి జరగాలన్న మంచి చేయాలన్న కుండ పాలన రావాలని అన్నారు. గతంలో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ కుండ గుర్తును కేటాయిచింది ఈసీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version