BREAKING : విజయోత్సవ ర్యాలీకి అనుమతి కోరిన కేఏ పాల్‌

-

BREAKING : విజయోత్సవ ర్యాలీకి కేఏ పాల్‌ అనుమతి కోరారని సమాచారం అందుతోంది. మునుగోడు పోరులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన కేఏ పాల్ అందరికంటే ముందే ఉన్నారు.

మిగతా నేతలు తమకు ఎన్ని ఓట్లు వస్తున్నాయని ఉత్కంఠతో ఉంటే, పాల్ ఇప్పటికే తన విజయోత్సవ ర్యాలీ కోసం పోలీసుల అనుమతి కోరారు. కానీ వారు ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మునుగోడులో తాను 50 వేల మెజార్టీతో గెలవబోతున్నట్లు శాంతి దూత ఇప్పటికే ప్రకటించారు. పాల్ కు ఇప్పటివరకు మూడు రౌండ్లలో కలిపి 34 ఓట్లు వచ్చాయి.  కాగా, మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో భాగంగా, నాల్గో రౌండ్‌లో బీజేపీకి భారీ ఆధిక్యంలో ఉంది. 2000లకు పైగా ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version