BREAKING : ఢిల్లీలో కల్వకుంట్ల కవిత దీక్ష

-

BREAKING : ఢిల్లీలో మార్చి 10న కల్వకుంట్ల కవిత దీక్ష నిర్వహించనున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ… భారత జాగృతి ఆద్వర్యంలో కల్వకుంట్ల కవిత నిరాహారదీక్ష చేయనున్నారు.

దిక్కులు పిక్కటిల్లేలా…ఢిల్లీ గద్దె వణికేలా హక్కులకై పోరాడదాం రండి అంటూ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అయితే ఈ తరుణంలోనే కల్వకుంట్ల కవిత బిగ్ షాక్ తగిలింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వరుస అరెస్టులు చేస్తూ ఈ స్కామ్​లో కూపీ లాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version