కమల్ మనసు దోచుకున్న జగన్!

-

అన్ని వర్గాల గురించి.. అన్ని స్థాయిల ప్రజల గురించి.. అన్ని సమస్యల గురించి తనదైన శైలిలో ఆలోచిస్తాడు అనేపేరు సంపాదించుకున్న వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కమల్ హాసన్ మనసు దోచుకున్నారు!

అవును… దివంగ‌త గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యానికి భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించాల‌ని కోరుతూ భార‌త‌ ప్ర‌ధానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ లేఖ రాయ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేసిన కమల్ ఈ మేరకు… ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు!

కాగా… ఎస్పీబీకి భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని ఇవ్వాల‌నే డిమాండ్ ను క‌మ‌ల్ కూడా చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి కూడా ఈ డిమాండ్ ప్ర‌ముఖంగా వినిపిస్తూ ఉంది!

 

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version