భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న కమల్ హాసన్.. ఎప్పుడంటే..?

-

 కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్‌ జోడో’ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ యాత్రలో హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు పాల్గొంటున్నారు. అంతే కాకుండా పలు రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు పాల్గొని రాహుల్ కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ నెల 24న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి మద్దతివ్వడానికి ఈ యాత్రలో ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పాల్గొననున్నారు. రాహుల్‌ గాంధీ ఆహ్వానం మేరకు వచ్చే వారంలో కమల్‌ హాసన్‌ ఈ యాత్రలో పాల్గొంటారని మక్కల్‌ నీది మయ్యం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్ర డిసెంబర్‌ 24న దేశ రాజధాని నగరంలోకి ప్రవేశించనుంది. ఎనిమిది రోజుల విరామం తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాలలో కొనసాగించనున్నారు. చివరగా జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ముందు వచ్చే నెలలో రాహుల్‌ పంజాబ్‌లో యాత్ర చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version