మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై కంగనా ఘాటు వ్యాఖ్యలు.. వరస్ట్ అంటూ..

-

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగనా రనౌత్ కి మధ్య జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ముంబైలో కంగనా ఆఫీసు అక్రమ నిర్మాణం అంటూ పడగొట్టడం మొదలగు విషయాలు జరుగుతూ వచ్చాయి.

ఐతే తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, కొంత మంది తమ రాష్ట్రాన్ని వదిలి మహారాష్ట్రకి చేరుకుని ఇక్కడ డబ్బు సంపాదించుకుంటారని, అయినా కూడా ముంబై నగరంపై విషం కక్కేలా మాట్లాడతారని అన్నాడు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ మాట్లాడుతూ, ముంబై నాకు షెల్టర్ ఇవ్వలేదు. మీ కొడుకు వయసుకి సమానమైన వయసులో ఉన్న ఒక మహిళపై ఇలా మాట్లాడడం సరికాదని చెప్తూ, ఉద్ధవ్ ఠాక్రే ఒక వరస్ట్ వారసత్వ వస్తువు అని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version