Breaking : రాజకీయాల్లోకి బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా..

-

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. ప్రజలు కోరుకుంటే.. బీజేపీ టికెట్ ఇస్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని వివరించారు. మహారాష్ట్రలో అప్పటి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంతో ఘర్షణ పడిన బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్‌కు బీజేపీ అండగా నిలిచింది. దీంతో త్వరలోనే ఆమె బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాలకు ఆమె స్పందించకున్నా ట్వీట్లతో తరచూ రాజకీయ పరిణామాలపై స్పందించేవారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత ప్రతీ ఒక్కరిలోనూ జాతీయభావం కనిపిస్తోందన్నారు.

తాను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మోదీ పనితీరుతో ఇప్పుడు తమ కుటుంబం బీజేపీవైపు నిలిచిందన్నారు. తాను కనుక సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్ ప్రదేశ్, మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, బీజేపీ కనుక కోరుకుంటే మండీ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతూ కంగన తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ రాహుల్ గాంధీ పోటీదారు కానేకాదని తేల్చి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాలు పనిచేయవని కంగన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version