“కరణ్ జోహార్ – సల్మాన్” కాంబోలో పవర్ ఫుల్ మూవీ !

-

బాలీవుడ్ లో కరోనా అనంతరం ఎవరైనా సక్సెస్ అయ్యారంటే అది కేవలం షారుఖ్ ఖాన్ ఒక్కడే అని చెప్పాలి. ఇతను వరుసగా పఠాన్ మరియు జవాన్ మూవీ లతో భారీ హిట్ లను అందుకుని బాలీవుడ్ కు ఊపిరి పోశాడు. ఇంకా స్టార్ హీరోలు అయిన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లు సరైన హిట్ ను అందుకోలేక చతికిలపడుతున్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బడా నిర్మాత కరణ్ జోహార్ మరియు సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో మూవీ ని తెరకేకించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా 2024 ఫిబ్రవరి లో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకు సూటబుల్ గా “ది బుల్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా 1988 లో మాల్దీవ్స్ టెర్రరిస్ట్ అటాక్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాను విష్ణువర్ధన్ అనే డైరెక్టర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబో బాలీవుడ్ ను ఊపేస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news