కరీంనగర్ యాదమ్మకు ఘోర అవమానం

-

కరీంనగర్‌ చెఫ్‌ యాదమ్మకు ఘోర అవమానం జరిగింది. హైదరాబాద్ మహా నగరంలో నిర్వహిస్తున్న బిజెపి సమావేశాల్లో జాతీయ నేతలకు తెలంగాణ వంటకాలు రుచి చూపిస్తామని బండి సంజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కరీంనగర్‌ చెఫ్‌ యాదమ్మకు అవకాశం కల్పిస్తున్నట్లు బండి సంజయ్‌ పేర్కొన్నారు.

కానీ నోవాటెల్ హోటల్ లోపలికి అనుమతించలేదని, తమ బృందానికి పాసులు ఇవ్వకుండా గోరంగా అవమానించాడని….. బండి సంజయ్‌ కుమార్‌ పై యాదమ్మ ఆరోపణలు చేసింది. దీంతో ఆమె తన బృందంతో రోడ్డుపై బైఠాయించాల్సి వచ్చింది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బండి సంజయ్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇవాళ సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌ లో ప్రధాని మోడీ బహిరంగ సభ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి లక్షల్లోజనాలు వస్తున్నారు. అటు హైదరాబాద్‌ లో పోలీసులు.. హై అలర్ట్‌ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version