ఎడ్యూరప్పకి రెండోసారి కరోనా పాజిటివ్.. ఆరోగ్య పరిస్థితి విషమం !

-

కర్ణాటక సీఎం యడ్యూరప్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురవడంతో… ఆయన్ను రామయ్య ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు సీఎం బీఎస్ ఎడ్యూరప్ప రెండోసారి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది.

yediyurappa

సీఎం ఎడ్యూరప్ప శుక్రవారం ఉదయం ఆసుపత్రికి సాధారణ తనిఖీ కోసం వెళ్లిన తరువాత ఆయనని రామయ్య ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సలహా ఇచ్చారు. రాబోయే ఉప ఎన్నికలకు బెలగావిలో ప్రచారం చేస్తున్న కర్ణాటక సీఎం జ్వరంతో బాధపడుతున్నారని, యాంటిజెన్ పరీక్ష కూడా చేయించుకున్నారని, అయితే అప్పుడు నెగటివ్ అని తేలినట్టు సమాచారం. దీంతో ఆసుపత్రికి వెళ్ళగా మరో సారి టెస్ట్ చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version