టాలీవుడ్ హీరోను వంశీ టార్చర్ చేసాడు షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. ఎల్లో జర్నలిజం చేస్తున్న వంశీ, మరికొంత మంది జర్నలిస్టులు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపకుంటే కలుగులో దాక్కున్నా వదలబోమని వార్నింగ్ ఇచ్చారు.

మహా న్యూస్ వంశీ మాట్లాడే నీచమైన మాటలను మహేష్ కుమార్ గౌడ్, కోదండరాం, శ్రీనివాస్ రెడ్డి సమర్ధిస్తారా? అని నిలదీశారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. మహా న్యూస్ వంశీ ఒక్కసారి కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు…. వంశీ ఎల్లో జర్నలిజం గురించి, నేర చరిత్ర గురించి అందరికి తెలుసు.. ఒక హీరోను బ్లాక్ మెయిల్ చేసి, రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచిన విషయం తెలుసు అన్నారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.