ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడు నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సమయానికి ఇతర పనుల పేర్లు చెప్పి.. టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు రాలేదు., డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలు తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకుంటున్నారని.. ప్రజలకు దూరంగా ఉండడం సరికాదని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫారిన్ ట్రిప్పులు వేసే బదులు, రాజకీయాలు మానుకుని ఫారిన్లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు చురకలు అంటించారు. సమావేశాలు ఉన్నప్పుడే దైవ దర్శనాలు పెట్టుకోవాలా? మరో రోజు పెట్టుకోవచ్చు కదా అని అసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.