ఇంగ్లాండ్ కౌంటీ లకు “ట్రిపుల్ సెంచరీ వీరుడు” కరుణ్ నాయర్ !

-

ఇండియా ఆటగాళ్లు ఎవరైతే ఫామ్ కోల్పోయి ఇండియా జాతీయ జట్టుకు దూరం అయ్యారో…వారు మళ్ళీ ఫామ్ లోకి రావడానికి విదేశీ కౌంటీ లలో ఆడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పృథ్వీ షా, పుజారా, రహానే, సుదర్శన్ లాంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ లో జరుగుతున్న కౌంటీ మ్యాచ్ లలో ఆడడానికి వారితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కర్ణాటకకు చెందిన కరుణ్ నాయర్ సైతం ఇంగ్లాండ్ కౌంటీ లకు వెళుతున్నాడు. ఆస్ట్రేలియా కు చెందిన సామ్ వైట్ మాన్ ఆఖరి మూడు మ్యాచ్ లకు దూరం కావడంతో నార్త్ ఆంప్టన్ షైర్ కరుణ్ నాయర్ ను భర్తీ చేసుకుంది.

కరుణ్ నాయర్ ఆఖరి మూడు కౌంటీ మ్యాచ్ లకు అందుబాటులో ఉండనున్నాడు. ఇక కరుణ్ నాయర్ ఇండియా తరపున టెస్ట్ లలో ట్రిపుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version