భువగిరి హాస్టల్ కి వెళ్ళిన కవిత.. నిందితులు ఎవరో తేల్చాలి..!

-

యాదాద్రి జిల్లా భువనగిరిలో సాంఘిక సంక్షేమ హాస్టల్ ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చూసి వచ్చారు. ఇటీవల హాస్టల్ లో భవ్య, వైష్ణవి అని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు హాస్టల్ ని సందర్శించి విద్యార్థుల మృతిపై ఆరా తీసారు కవిత. అక్కడ పరిస్థితుల్ని అడిగి ఆమె తెలుసుకున్నారు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు కవిత. భవ్య వైష్ణవి పదవ తరగతి చదువుతున్నారు. ఈ చిన్నారులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు కవిత.

వరంగల్ వెళుతూ మార్గమధ్యలో భువనగిరిలోని ఎస్సీ హాస్టల్ ని ఆమె చూశారు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. మళ్లీ ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని అన్నారు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినిలకు వారి కుటుంబంలోకి ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు హాస్టల్స్లో సెక్యూరిటీని పెంచాలని అన్నారు గవర్నమెంట్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని చెప్పారు నిందితులు ఎవరో తేల్చాలి అని కవిత అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news