వాళ్ళ బెండు తీయాలి అంటే కే‌సి‌ఆర్ మాత్రమే కరక్ట్ – అద్దిరే నిర్ణయం !

-

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన పురపాలక ఎన్నికలలో కెసిఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో గెలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మరొకసారి టిఆర్ఎస్ పార్టీని నమ్మటం జరిగిందని మరొక సారి రుజువు చేశారని పేర్కొన్నారు. ఇటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొంతమంది బాధ్యతగల పదవుల్లో ఉన్న వారిపై వ్యవహరిస్తున్న తీరు తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు కేసీఆర్. అది సోషల్ మీడియా నా..? లేకపోతే ఏంటి సోషల్ మీడియా నా..? అంటూ కామెంట్ చేశారు.

అయితే త్వరలోనే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో సోషల్ మీడియాపై గట్టి చర్యలు తప్పవని హద్దులు దాటితే వాటి పర్యవసానాలు కూడా అరికట్టడానికి చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. బాధ్యతగల పదవిలో ఉన్న వారిపై ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పటివరకు చేసిన సహించం రాబోయే రోజుల్లో మాత్రం చాలా కఠినంగా సీరియస్ చర్యలు ఉండబోతున్న ట్లు కెసిఆర్ కామెంట్లు చేయడం తో సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారికి కెసిఆర్ కరెక్ట్ మొగుడిని అలాంటి వాళ్ళు బెండు తీయాలంటే ఇటువంటి నాయకుడే కరెక్ట్ అని కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

సోషల్ మీడియాలో చాలా వరకు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది స్వార్ధపూరిత రాజకీయాలు వ్యవహరిస్తున్నారని వాళ్లకి కెసిఆర్ కరెక్ట్ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version