నగరానికి చేరుకున్న కేసీఆర్

-

తెలంగాణ ముఖ్యమంత్రి , తెరాస అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కి చేరుకున్నారు. తెరాస పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా లీజుకి తీసుకున్న విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు నాన్ బీజేపీ – నాన్ కాంగ్రెస్ కూటమి ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్‌ పలు రాష్ట్రాలకు ఈ నెల 23న రాష్ర్టాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

23న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, 24న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. 24న రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. 26న ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. దాదాపు నాలుగు రోజుల పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రగతి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. బేగంపేటకు చేరుకున్న కేసీఆర్ కి పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి.

Read more RELATED
Recommended to you

Latest news