జీఎస్టీ శాఖకు మహేశ్ బాబు లీగల్ నోటీసులు..

-

సరైన సమయంలో ఆదాయపన్ను చెల్లించనందుకు…ఆయన బ్యాంక్ అకౌంట్లును నిలిపివేసిన జీఎస్టీ శాఖకు నటుడు మహేశ్ బాబు లీగల్ నోటీసులు పంపారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడం పట్ల తన ఇమేజ్ కి డామేజ్ అయిందన్నారు. ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడిగా.. తాను పన్నులన్నీ సక్రమంగానే చెల్లించానని మహేశ్ తెలిపారు.

ఈ వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ బ్యాంక్ అకౌంట్లను నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన తప్పు పట్టడంతో మహేశ్  లీగల్ టీమ్ జీఎస్టీ శాఖకు లీగల్ నోటీసులు పంపింది. హైదరాబాద్  కోర్టు పరిధిలో ఉన్న రూ.18.50 లక్షల పన్నును వడ్డీతో కలిపి రూ.73.50 లక్షలుగా నిర్ణయించి.. బ్యాంక్ ఖాతాల నిలుపుదలకు ఆదేశించారని మహేశ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news