BRS జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..ముగిసిన 22 ఏళ్ల TRS ప్రస్థానం.. BRS గా ఆవిర్భావం

-

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ పత్రాలపై సంతకం చేసిన కేసీఆర్‌..జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్‌ జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌.. జాతీయ పార్టీ మారమని ప్రకటించారు.

ఇక ఈ ప్రక్రియతో… 22 ఏళ్ల పాటు తెలంగాణతో పాటు దేశ ప్రజలకు టిఆర్ఎస్ గా తెలిసిన పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. తెలంగాణ కోసం కోట్లాడిన పార్టీగా జనం గుండెల్లో టిఆర్ఎస్ నిలవగా, పార్టీ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేయడంతో బిఆర్ఎస్ ప్రస్థానం మొదలైంది. బిఆర్ఎస్ పేరుతో కెసిఆర్ ఇకపై దేశ రాజకీయాల్లో సమర శంఖారావం పూరించనున్నారు. ఇది కేవలం పార్టీ పేరు మార్పు కాదని, దేశ గతిని మార్చే ఓ శక్తి అంటూ టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version