హిందూ మతం స్వీకరించిన మలయాళీ డైరెక్టర్

-

మలయాళం సినిమా డైరెక్టర్ అలీ అక్బర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను, తన భార్య ఇస్లాంను వీడి హిందూ మతం స్వీకరించనున్నట్లు ప్రకటించారు. హెలిక్యాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతిచెందిన సంఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ అలీ అక్బర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అయితే, కొంత మంది స్మైలీ ఎమోజీలు పెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇస్లాంను వీడుతున్నట్లు తెలిపారు. ఈరోజు నుంచి నేను ముస్లింను కాదని, తాను ఇండియన్‌ను అని ఓ వీడియో మెసేజ్‌లో పేర్కొన్నారు.

ఈరోజు, నా పుట్టుకతో వచ్చిన వస్త్రాధారణను విసిరిపారేస్తున్నాను అని అలీ అక్బర్ పేర్కొన్నారు. ఆయన హిందూ మతాన్ని ఎంచుకొని తన పేరును రామసింహన్‌‌గా మార్చుకున్నారు. తన ఇద్దరు కూతుర్లను మతం మార్చుకోమని ఒత్తిడి తీసుకురానని, వారి ఇష్టానుసారం ఏ మతంలోనైనా కొనసాగవచ్చని అలీ అక్బర్ స్పష్టం చేశారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మృతిపై సోషల్ మీడియాలో కొందరు హార్షతిరేకాలు వ్యక్తం చేయడాన్ని ఏ మత గురువు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేకపోయారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version