లోకేష్ ని ఏపీ సీఎం చెయ్యడం చంద్రబాబు లక్ష్యం: కేశినేని నాని

-

ఏపీ పాలిటిక్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలవేళ ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరొకసారి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నన్ను మెడ పట్టుకుని గెంటేస్తే సీఎం జగన్ సీటు ఇచ్చారని.. కొడుకు లోకేష్ మాజీ ఏపీ సీఎం చైర్మన్ టిడిపి అధినేత చంద్రబాబు లక్ష్యమని అన్నారు కేశినేని నాని. చంద్రబాబు, లోకేష్ విజయవాడ ని స్మశానం చేయాలని చూస్తున్నారని అన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోతుందని ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని అన్నారు. టిడిపికి 54 సీట్లే వస్తాయని పలు సర్వేలు చెబుతున్నాయని ఏపీ రాజధానిగా అమరావతికి నేను వ్యతిరేకం కాదని నాని అన్నారు. ఇప్పుడు నాని చెప్పిన ఈ విషయాలు చర్చనీయాంశంగా మారాయి టిడిపి నేతలు అమరావతిలో రైతులు భూములు తీసుకుని మోసం చేశారని చెప్పారు కేశినేని నాని. ఈసారి నాని కి విజయవాడ ఎంపీ టికెట్ నిరాకరించడంతో కేశినేని ఎంపీ పదవితో పాటుగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేసారు

Read more RELATED
Recommended to you

Latest news