TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం..వారందరికీ ఈడీ నోటీసులు

-

TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ… ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ ను ముందుగానే అందుకుని… విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారని అభియోగలపై విచారణ ప్రారంభించింది ఈడీ.

ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ… సిట్ సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మిపై ప్రధాన దృష్టి పెట్టింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్ట్రోడియన్ గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయిందని.. శంకర్ లక్ష్మి తో పాటు టిఎస్పిఎస్సి కి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్న ఈడీ.. కోర్టు అనుమతితో ప్రవీణ్, రాజశేఖర్ కస్టడీలోకి తీసుకొని విచారించునుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version