వివాహేతర సంబంధం కోసం కొడుకుని చంపేసింది…!

-

వివాహేతర సంబంధాలు ఇద్దరు వ్యక్తుల మధ్య గుట్టు చప్పుడు కాకుండా ఉంటే ఏ ఇబ్బంది లేదు గాని అవి క్రమంగా పెరిగితే మాత్రం జీవితాలను నాశనం చేస్తాయి అనేది వాస్తవం. వివాహేతర సంబంధం అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ గా మారిపోయిన వ్యవహారం. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు కొందరు. సోషల్ మీడియాలో, ఫోన్ కాల్స్ లో పరిచయం అయిన వాళ్ళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు.

ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారు కొందరు. పిల్లలు, మొగుడు, పెళ్ళాం, బాధ్యతలు, బరువులు ఇవేమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హత్యలకు కూడా వివాహేతర సంబంధాలు దారి తీస్తున్నాయి. అడ్డుగా ఉంటున్నారని, భార్యలను చంపడం, భర్తలను చంపడం పిల్లలను చంపడం వంటివి మరింతగా ఎక్కువైపోయాయి అనే చెప్పవచ్చు.

తాజాగా ఒక మహిళ ఏకంగా కొడుకునే వివాహేతర సంబంధం కోసం చంపేసింది. నల్గొండ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఎనిమిదేళ్ల కుమారుడు నాగరాజును అతడి తల్లి విజయ ప్రియుడితో కలిసి గొంతును టవల్‌తో బిగించి చంపేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టింది. నాగరాజు మరణం అనుమానాస్పదంగా ఉన్న నేపధ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విచారణలో అసలు విషయం వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version