మూడవసారి మోడీ ప్రధాని కాబోతున్నారు: కిషన్ రెడ్డి

-

బీఆర్ఎస్ పార్టీ మీద కేంద్ర మంత్రి టీ బీజేపీ చీఫ్ కె కిషన్ రెడ్డి మరోసారి విమర్శలు చేసారు. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించారు ఈ సభకి హాజరైన కిషన్ రెడ్డి తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు కేసీఆర్ ది నిన్నటి పార్టీ అని ఎద్దేవా చేశారు పదేళ్లు కుటుంబ అవినీతి పాలన కేసీఆర్ తెలంగాణ ప్రజల మీద రుద్దారని అన్నారు.

అందుకనే ఎన్నికల్లో తిరస్కరించారని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలుని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన రోడ్ మ్యాప్ లేదని అన్నారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంకు రాజకీయాలు చేస్తోందని అన్నారు 10 ఏళ్లలో ప్రధాని మోడీ దేశముఖ చిత్రాన్ని మార్చేశారని అన్నారు తెలంగాణలో బిజెపిని 17 సీట్లలో గెలిపించాలని అన్నారు హైదరాబాదులో ఎంఐఎం ని కూడా ఓడిద్దామని పిలుపునిచ్చారు మూడోసారి మోడీ మళ్ళీ రావాలని ఆశీర్వదించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news