గ్యారంటీ అంటూ గారడీ.. రాహుల్ గాంధీ పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

-

గ్యారెంటీ ల పేరు తో రాహుల్ గాంధీ తెలంగాణలో గారడి చేస్తున్నారని కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ లో బిజెపి గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు తర్వాత ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఢిల్లీకి హైదరాబాద్ కి తిరుగుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు వ్యాపారులని బెదిరించి డబ్బులు వసూలు చేసే ఢిల్లీకి సూట్ కేసులు పంపిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మట్లేదని రాహుల్ గాంధీ పైన దేశ ప్రజలకి విశ్వాసం లేదని అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగంలో 95% నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. ఈ ఎన్నికలు మోడీ కోసం కాదు దేశ భవిష్యత్తు కోసం అని అన్నారు. పార్టీ పార్టీ నాయకుడు కంటే ఈ దేశం దేశ ప్రజలు మాకు ముఖ్యమని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news